ప్రకాశం: జరుగుమల్లి మండలానికి నూతన తహసీల్దాగా కె. వెంకటేశ్వర్లు శుక్రవారం అధికార బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో జరిగిన చిన్న కార్యక్రమంలో ఆయన పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని కె. వెంకటేశ్వర్లు తెలిపారు.