NTR: గత ప్రభుత్వ హయాంలో నమోదైన మూడు కేసుల విచారణలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఊరట లభించింది. విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం జరిగిన వాదనలు విన్న అనంతరం కేసుల్లో సరైన ఆధారాలు లేవని గుర్తించిన న్యాయస్థానం మూడు కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో దేవినేని ఉమాతోపాటు టీడీపీ నేతలకు ఊరట లభించింది.