ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 140 పిటిషన్లు అందాయి. జిల్లా ఎస్పీ పి. జగదీష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడి కుటుంబ కలహాలు, రస్తా వివాదాల వంటి సమస్యలను స్వయంగా విన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.