నెల్లూరు జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ సహాయకులకు ప్రమోషన్ వచ్చింది. ఎం.శ్రీలత, ఎన్.విజయలతను పరిపాలనా అధికారులుగా నియమించారు. జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈవో శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం వారికి నియామక పత్రాలు అందజేశారు. అలాగే, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.