GNTR: వాతావరణ శాఖ సూచనల మేరకు వచ్చే మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. వర్షం తగ్గే వరకు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, వార్డ్ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.