SRCL: గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలను తరలించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఐదుగురు అక్కడే చిక్కుకుపోయారు. కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు.