RR: రంగారెడ్డి జిల్లాలో రాబోయే రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాల కారణంగా తాత్కాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.