TG: భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో రేపు స్కూళ్లు, కళాశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల చెరువులు తెగిపోవడంతో వరద నీరు గ్రామాలలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.