NZB: నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు నిజాంసాగర్ మండల పరిధిలోని మరుపల్లి గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. మరిన్ని గేట్లను ఎత్తేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉన్న మరుపల్లి గ్రామం ప్రజలను నిజాంసాగర్ మండల కేంద్రానికి తరలించారు.