BDK: ములకలపల్లి మండలం జగన్నాధపురం నుంచి దమ్మపేట వెళ్లే రోడ్డు మార్గం గుంతల మయంగా మారింది. పాత గంగారం వద్ద రోడ్డు గుంతలు పడి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి ప్రమాదాలకు దారితీస్తుందని స్థానికులు వాపోతున్నారు. గుంతలు పడిన రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.