KMR: జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లాకు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 3-4 గంటల్లో బిక్కనూర్, కామారెడ్డి, డొమకొండ, రాజంపేట మండలాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, నిజాంసాగర్, బాన్సువాడ, పిట్లం మండలంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలో పేర్కొన్నారు.