NDL: నేషనల్ ఇంగ్లిష్ ఒలంపియాడ్ 2025-26 పరీక్షల్లో ఆళ్లగడ్డ (M) కోట కందుకూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని సఫియా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్, మొమెంటోతో పాటు లెనోవో ట్యాబ్ అందుకున్నట్లు ప్రిన్సిపల్ రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సఫియాను ఉపాధ్యాయలు ప్రత్యేకంగా అభినందించారు.