NLR: జిల్లాలోని కలిగిరి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన చిన్నయ్య మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రాగానే కుటుంబ సభ్యులు విలపించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాకర్ల ట్రస్ట్ తరఫున అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందజేసి, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పార్టీ నాయకులు తెలిపారు.