SKLM: ఆదివాసి వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని దళిత ఆదివాసి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక డా. బి.ఆర్. అంబేద్కర్ మందిరంలో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచనలను పల్లె పల్లెకు తీసుకెళ్లాలని, దళితుల సమస్యలు పరిష్కారానికి ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.