ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో పండగ కానుకల పంపిణీ గురువారం ఘనంగా జరిగింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు టాటా హజీ ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ పండగలను పురస్కరించుకుని 2 వేల కుటుంబాలకు నిత్యావసర కిట్లను అందజేశారు. ఈ కిట్లలో బియ్యం, కందిపప్పు, నెయ్యి వంటి వస్తువులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.