TPT: ఎస్వీయూలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మేళాలో ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొని 300 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.