AKP: జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడును నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు బుధవారం కలిశారు. పదో తరగతి మూల్యాంకన విధుల్లో 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు, అనారోగ్య కారణాలచే అభ్యర్థించుకున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని, మూల్యాంకన రుసుమును జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలన్నారు.