కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి కుటుంబసభ్యులు రూ. 60 లక్షలు విలువ చేసే 350 గ్రాముల బంగారంతో చేసిన మకర తోరణాన్ని శుక్రవారం సమర్పించారు. దాత కుటుంబ సభ్యులు ఈ మకర తోరణాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావుకు అందజేశారు. ఆయన వారిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.