నెల్లూరు: మనది అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టివొదిలేసే బ్యాచ్ కాదని MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం ఇందుకూరుపేట(M) ముదివర్తిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ముధవర్తి కాజ్వే బ్రిడ్జ్ గత ప్రభుత్వంలో టెంకాయలు కొట్టి వదిలేశారని, చంద్రబాబు 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. రూ.2002 కోట్లతో కాజ్వే త్వరలో పూర్తవుతుందన్నారు.