AKP: పాయకరావుపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అన్న క్యాంటీన్ పనులను బుధవారం మండల అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వరహాలు బాబు, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిబాబు పాల్గొన్నారు.