ఎన్టీఆర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృ వందనం యోజన పథకాన్ని గర్భవతులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి షేక్ కరీముల్లా అన్నారు. ఈ సందర్భంగా కంచికచర్ల మండలంలోని కీసర గ్రామ పంచాయతీ కార్యాలయంలో పీఎంఎంవీవై పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.