పార్వతీపురం పట్టణంలో తాగునీటి కష్టాలు. పట్టణంలో పలు ప్రాంతాలకు ఒకసారి తాగునీరు విడిచిపెడుతున్నారు. శివారు కాలనీల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేతలను నిలదీద్దాం అంటే కనిపించడంలేదని మహిళలు చెబుతున్నారు. బిందెడు నీటికోసం గంటలతరబడి నిలబడుతున్నారు.