BPT: అద్దంకి నియోజకవర్గంలో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 5,920 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ మేరకు సంతమాగులూరు మండలం కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీలో సోలార్ పనులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లూరి మస్తాన్ రావు ప్రారంభించారు.