ATP: తాడిపత్రి పట్టణంలో నాలుగు రోజులపాటు క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. క్రీడా పోటీల్లో పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థి మానస అథ్లెటిక్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 200మీ పరుగు పందెంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ప్రతిభ చాటిన విద్యార్థి మానసను ప్రిన్సిపల్ అమర్నాథ్, వ్యామాయ ఉపాధ్యాయులు దాదు, శివలు అభినందించారు.