కృష్ణా: విజయవాడ భారతీనగర్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పటమట, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ సాగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు గణేశ్, ప్రసాద్, శ్రీనివాసరావు, రంగబాబులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు.