NTR: విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో బుధవారం 27వ డివిజన్ గులాబీ తోట అన్న క్యాంటీన్ సమీపంలోని అమరావతి వాకర్స్ క్లబ్లో బహిరంగ సభ నిర్వహించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మంది మహిళలు పాల్గొన్నారు. “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన”పై అవగాహన కల్పిస్తూ సోలార్ ఎనర్జీ వినియోగం ద్వారా విద్యుత్ ఆదా చేయగల ప్రయోజనాలను వివరించారు.