సత్యసాయి: బుక్కపట్నంలోని శ్రీ చౌడేశ్వరి మాత ఆలయ సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆలయాల నిర్మాణంతో సమాజంలో ఆధ్యాత్మికత, భక్తిభావం పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని, మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికత ఎంతో అవసరమని తెలిపారు.