CTR: నగరి మున్సిపాలిటీ ఓరుగంటాపురంలో జరిగిన గృహప్రవేశం కార్యక్రమంలో సోమవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే భాను ప్రకాష్ తాళం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదటి విడత కింద 2025 నవంబర్లో 3,00,192 ఇళ్లను పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం, రెండో విడతగా మరో 2,50,893 ఇళ్లను పంపిణీ చేస్తుందని తెలిపారు.