PLD: నరసరావుపేట మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు కొనసాగుతున్నట్లు ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి తెలిపారు. మంగళవారం పాలపాడు, ములకలూరు గ్రామాలలోని సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులకు సంబంధించి నమోదు, చేర్పులు, మార్పులను పర్యవేక్షించారు. ఆయా గ్రామాల్లోని వారు క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.