NLR: ఉదయగిరి(M) అప్పసముద్రంలో వినాయక నిమజ్జన సందర్భంగా బాణసంచా పేలుళ్లలో గాయపడిన 9 మంది బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సహకారంతో సీఎం ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గాయపడిన చిన్నారులకు భవిష్యత్తులో ప్లాస్టిక్ సర్జరీకి సహకరిస్తామని హామీ ఇచ్చారు.