NLR: మహిళలు పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం- 2013 మరింత పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం నెల్లూరు తిక్కన ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 10 మంది పైన మహిళా ఉద్యోగులు పని చేస్తున్న చోట ఐ.సి.సి ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టం చేశారు.