కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవులో శుక్రవారం మధ్యాహ్నం సముద్ర స్థానానికి దిగి గల్లంతైన అమలాపురంకి చెందిన ఇంటర్ విద్యార్థి దొమ్మేటి లోకేష్ మృతదేహం శనివారం లభ్యమైంది. మెరైన్ పోలీసులు లోకేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా, మృతదేహాన్ని శనివారం గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.