SKLM: నరసన్నపేటలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి పొట్నూరు గుప్త హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ లక్ష్మణ తెలిపారు. మంగళవారం నరసన్నపేట సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హత్య కేసులో మురళి అప్పలరాజ జవ్వాది సంతోష్ కుమార్లను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుండి కేజీ 33 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.