పార్వతీపురం నుంచి కూనేరు మీదుగా రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. పెద్దపెద్ద గోతులతో దర్శనమిస్తోంది. ఈ రోడ్డులో ప్రయాణించేందుకు వాహనచోదకులు భయపడుతున్నారు. ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. మరోవైపు 1933లో జంఝావతి నదిపై కోటిపాం గ్రామ సమీపంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. పరిమితికి మించి వాహనాలు తిరుగుతున్నాయి.