BPT: సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో ఆత్మ ప్రకాశం జిల్లా సౌజన్యంతో, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కిసాన్ గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి ARS శాస్త్రవేత్త డా. చి. వరప్రసాద్ రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడుకోవాలని సూచించారు. ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫేట్ వినియోగం వల్ల జింక్ లోపాలు నివారించవచ్చన్నారు