SKLM: స్నేహితుడి వివాహానికి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి, బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని బడ్డీ బాలకృష్ణ (25) అనే ఆర్మీ జవాను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడు ఆర్.దిలీప్ అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రున్ని చికిత్స కోసం 108లో ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై ఆర్.జనార్దన్ రావు కేసు నమోదు చేశారు.