KDP: గ్యాస్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి సునీల్ కుమార్ రెడ్డి మహిళలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇవాళ పులివెందులలోని జయమ్మ కాలనీలో ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్లను ఆఫ్ చేయాలన్నారు.