కర్నూలు: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా సకాలంలో, నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకోవాలని జేసీ నూరుల్ ఖమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు నగరంలోని సివిల్ సప్లై బఫర్ గోదాంను ఆయన సందర్శించారు. ప్యాకింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయబడుతున్న 3 కిలోల, 25 కిలోల బియ్యం ప్యాకెట్ తయారీని జేసీ పరిశీలించారు.