E.G: డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలు, నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అంబేద్కర్ సేవలను స్మరించుకుని, ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో నడవాలని సంకల్పించారు.