GNTR: ‘జన గణన -2026’పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తెనాలిలో ఆదివారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన 5కే రన్ ప్రదర్శనను ఎమ్మార్వో గోపాలకృష్ణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామారావు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ రన్ సాగింది. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.