GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం మార్కెట్ యార్డులోని ఈవీఎం, VVPATS భద్రపరిచిన గోడౌన్ను గురువారం గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కే .శ్రీనివాసరావు పరిశీలించారు. గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం సీసీటీవీ పనితీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం తహసీల్దార్ ప్రసాదరావు పాల్గొన్నారు.