KKD: తండ్రిని కోల్పోయి విషాదంలో ఉన్న మాజీమంత్రి కురసాల కన్నబాబును మండపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గురువారం పరామర్శించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మాజీ ఎమ్మెల్సీ అనంతబాబులతో కలిసి కన్నబాబు నివాసానికి వెళ్లి దివంగత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.