ప్రకాశం: చంద్రశేఖరపురం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను గురువారం కనిగిరి DSP సాయి యశ్వంత్ ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరీక్షించాలని ఆదేశించారు. గ్రామాలలో పల్లె నిద్ర చేపట్టి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.