SRPT: జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రంథాలయాలకు చెల్లించాల్సిన గ్రంథాలయ సెస్లను చెల్లించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేటలోని గ్రంథాలయంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రంథాలయాలకు రూ.2 కోట్ల వరకు మున్సిపల్ సెస్ రావాల్సి వుందని, త్వరగా చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు.