ASR: డుంబ్రిగుడ మండలంలోని ఓంబీ, జాకరవలస ప్రాథమిక పాఠశాలలను రెండవ మండల విద్యాశాఖ అధికారి జీ. గెన్ను శనివారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న బోధన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సకాలంలో విధి నిర్వహణ చేపట్టి విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.