ATP: గుత్తి పట్టణంలోని కొండలో వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం గుత్తి టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.