KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం చేపట్టే ఈ కార్యక్రమంలో సి.ఐలు,ఎస్.ఐలు,సిబ్బంది పాల్గొని స్టేషన్లు,పరిసరాలను శుభ్రం చేశారు.చెత్త తొలగింపు,పిచ్చి మొక్కల నిర్మూలనతో పాటు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.