PLD: పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సున్నంబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో, అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.