అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.