తిరుపతి: చింతలచేను రోడ్డులోని మంజునాథ ట్రావెల్స్లో దారుణం జరిగింది. డ్రైవర్ సెల్వరాజ్ (55)ను క్లీనర్ గోపి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సెల్వరాజ్ తల వెనుక భాగంలో గోపి బలంగా కొట్టి ప్రాణాలు తీశాడని సమాచారం. హత్య అనంతరం నిందితుడు గోపి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.